స్వామి, అమ్మవార్ల ముస్తాబుతో ప్రారంభమైన ద్వారకా తిరుమల చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు ఇవాళ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లి కొడుకు, పెండ్లి కూతురుగా అలంకరించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 25 వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో స్వామి వారికి జరిగే నిత్య కళ్యాణాలు, ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. ఉత్సవాలు జరిగినన్ని రోజుల పాటు ఉదయం, సాయంత్రం గ్రామోత్సవాలను ఆలయ సిబ్బంది నిర్వహిస్తాంచనుంది.

ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 25 వరకూ ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. 19వ తేదీన రాత్రి 7 గంటల నుంచి అంకురార్ఫణ జరగనుంది. ఈ క్రమంలోనే రుత్విగ్వరణ, ధ్వజారోహణ నిర్వహించున్నారు. రాత్రి 9 గంటల నుంచి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 25న ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం – పవళింపుసేవతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Share this post with your friends