ఎర్రితాత స్వామి బ్రహ్మ రథోత్సవం.. మొక్కులు చెల్లించుకున్న భక్తులు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని వై.రాంపురంలో శ్రీ ఎర్రి తాతా స్వామి బ్రహ్మరథోత్సవం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత ఆలయంలో మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేసి గ్రామంలోని బొడ్రాయి వరకు ఊరేగించారు. రథం లాగుతున్న సమయంలో భక్తులు అరటి పండ్లు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు.

Share this post with your friends