నృసింహ, సుదర్శన మంత్రాలతో మార్మోగిన యాగశాల

సింహాద్రి అప్పన్న దేవాలయంలో నారసింహ మహా యజ్ఞానికి అంకురారోపణ జరిగింది. ఈ యజ్ఞం ఐదురోజులపాటు జరగనుంది. ఈ సందర్బంగా నృసింహ, సుదర్శన మంత్ర స్మరణతో యాగశాల మార్మోగింది. తొలుత అర్చకులు దేవేరుల సమేతుడైన స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరువీధిగా యాగశాల ప్రవేశం చేయించారు. ఆలయ స్థానాచార్యులు సింహాద్రినాథుడి మహత్యాన్ని ప్రవచనం చేస్తుండగా అర్చకులు ఉభయదాతలతో సంకల్పం చేయించి కంకణధారణ జరిపించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్ఛారణలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ యాగ ద్రవ్యాలను హోమగుండాల్లో సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు.

Share this post with your friends