ఘనంగా ద్వాదశ జ్యోతిర్లింగాల మెట్ల పూజ

కర్నూలు జిల్లా కోడుమూరులో ద్వాదశ జ్యోతిర్లింగాల మెట్ల పూజ ఘనంగా జరిగింది. అరటి బోదెలతో నిర్మించిన శివమంటపంలో శివుణ్ణి లింగరూపంలో ఉంచి ద్వాదశ మెట్లను ఏర్పాటు చేసి వాటిపై వేదమంత్రోచ్ఛారణల నడుమ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ ఆలయ ప్రాంగణంలో అన్నదాన క్రతువును ప్రారంభించి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నాటక బాదనహళ్ళి మఠం పీఠాధిపతి కరి బసవస్వామి పాల్గొన్నారు.

Share this post with your friends