రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీకి ప్రశంసల వెల్లువ

రథసప్తమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు తిరుమలలో జరిగే సప్త వాహనాలలో శ్రీ మలయప్ప స్వామి వైభవాన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి అన్ని గ్యాలరీలలో భక్తులు నిండిపోయారు. వారికి అన్నప్రసాదం, తాగునీరు, పానీయాలు, సుండల్, బిస్కెట్లు వంటివి నిరంతరాయంగా టీటీడీ సిబ్బంది. ముఖ్యంగా భక్తులకు ఎండ తగలకుండా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా బోర్డు సభ్యులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఉదయం నుండి సాయంత్రం వాహనములు పూర్తయ్యే వరకు భక్తులకు వివిధ రకాల అన్నప్రసాదాలను అందిస్తున్నందుకు వారందరినీ టీటీడీ ప్రశంసించింది. భద్రతా చర్యలతో పాటు పారిశుధ్యం, పరిశుభ్రతకు భక్తుల నుండి భారీ ప్రశంసలు లభించాయి. టాయిలెట్లు సంపూర్ణంగా నిర్వహించబడుతున్నాయి. ఉదయం 4 గంటల నుండి అన్ని వాహనములు పూర్తయ్యే వరకు గ్యాలరీలలో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకుల సేవలకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు. మొబైల్ బ్యాటరీ కార్లలో భక్తులకు అందించే వైద్య సేవలను అందించిన టీటీడీపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

Share this post with your friends