
కాలభైరవుడంటే.. శివుని స్వరూపమే. అలాంటి కాలభైరవుని ప్రముఖ ఆలయాలు మన దేశంలో నాలుగు ప్రాంతాల్లో ఉన్నాయి. అవెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
1.వారణాసి (ఉత్తరప్రదేశ్) :
కాలభైరవునికి బ్రహ్మహత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈక్షేత్రం ప్రసిద్దిచెందినది.అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు.
2.ఉజ్జయిని (మధ్యప్రదేశ్లో ఇండోర్) :
గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది.స్వామి విగ్రహం అల్కాహాల్ ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము.
3.దంతేవాడ (చత్తిస్ ఘడ్ లో జగదల్ పూర్) :
ప్రాచీనాలయం ధ్వంసంకాగా భైరవమూర్తులు ఒక చిన్నపాకలో కొన్ని శతాబ్ధాలు అర్చించబడినాయి. ప్రస్తుతం కన్పించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పైకప్పుగా పెంకులతో కన్పిస్తుంది. ఈ మందిరంలో నాలుగు భైరవమూర్తులు దర్శినమిస్తాయి.
1. వనభైరవుడు!
2. జటాభైరవుడు!
3. గధాభైరవుడు!
4. తాండవభైరవుడు!
4.తేజ్ పూర్ (అస్సాంలో గౌహతి) :
ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామిపేరు’మహాభైరవుడు.’లింగరూపంలో పూజ లందు కుంటాడు.సుమారు 5,500 సం.ల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈలింగాన్ని ప్రతిష్ఠించి,పూజించినట్లు స్థలపురాణం. నాగులు ఈలింగాన్ని పూజించేవి అనుటకు నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్ప స్తంభాలు, ఆలయం ముందు ప్రవేశ ద్వారం ఉన్నాయి.
