సాధారణంగా చైత్రపూర్ణిమకు ముందుగా హనుమద్దీక్షలు తీసుకుంటారు. వైశాఖం ఎండాకాలం కనుక, దీక్షలకు అనుకూలమైన కాదు. హనుమద్దీక్షా పరులకు శారీరక మానసిక రుగ్మతలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి సుఖ శాంతులు కలుగుతాయి. దీక్షా నియమాలను పాటించగలిగే వారందరూ ఈ దీక్షాస్వీకారానికి అర్హులే. తిరుమల క్షేత్రంలో అంజనాద్రిపై హనుమంతుని జన్మస్థలమైన జాబాలి తీర్థం, తెలంగాణ కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి 15 కి.మీ.లు దూరంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం హనుమద్దీక్షా విరమణకు ముఖ్యమైన క్షేత్రాలు.
2024-05-29