
హిందూమతంలో పౌర్ణమికే కాదు.. అమావాస్యకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. అమావాస్య విషయంలోనూ సోమవతి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సోమవారం అమావాస్య తిథి వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు. ఈ రోజు శివపార్వతులను కొలుస్తారు. సోమవతి అమావాస్యనాడు శివపార్వతులను పూజిస్తే మనం కోరిన కోరికలన్నీ నెరవేరడంతో పాటు జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయని నమ్మకం. కాబట్టి ఈ రోజుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మరి సోమవతి అమావాస్య ఎప్పుడు రానుంది? ఆ రోజున చేయాల్సిన పరిహారాలేంటో తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్షంలోని అమావాస్య తిథి డిసెంబర్ 30న ఉదయం 4:01 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ 31 తెల్లవారుజామున 3:56 గంటలకు ముగుస్తుంది.ఉదయతిథి ప్రకారం సోమవతి అమావాస్య డిసెంబర్ 30 న మాత్రమే జరుపుకోవాలి. అయితే ఈ రోజున చేసే కొన్ని పరిహారాలు మనకు చాలా మంచి చేస్తాయట. అవేంటో తెలుసుకుందాం. సోమవతి అమావాస్య రోజున శివలింగానికి నీరు,పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తే చాలా మంచిదని చెబుతారు. సోమవతి అమావాస్య నాడు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
