భీష్ముడికి.. జటాయువుకి తేడా ఏంటి?

జటాయువు తన మరణ సమయంలో శ్రీరాముని ఒడిలో పడుకుని చిరునవ్వులు చిందించాడట. శ్రీరాముడు కన్నీళ్లుపెట్టుకున్నాడట. మరోవైపు మహాభారతంలో భీష్మ పితామహుడు హంపశశయ్యపై పడుకుని రోదించుచుండగా.. శ్రీ కృష్ణుడు చిరునవ్వు చిందించాడట. ఈ తేడా ఎందుకు? ఇద్దరికీ మరణ సమయమే కదా అంటే జటాయువుకు శ్రీరాముడి ఒడి పాన్పు అయితే భీష్మపితామహుడికి బాణపు మొనలు పాన్పుగా అయ్యాయి. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు కదా. జటాయువు తన కర్మ బలం ద్వారా ‘శ్రీరాముడి’ ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు. భీష్ముడిది కర్మ ఫలమే. అందుకే బాణపు మొనలు పాన్పుగా మారాయి. దీనికి కారణమేంటో తెలుసుకుందాం.

ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు కానీ అడ్డుకోలేకపోయాడు. ద్రౌపది ఏడుస్తూ అరుస్తూ, అరుస్తూ ఉన్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు తప్ప ద్రౌపదిని రక్షించలేదు. దీని ఫలితంగానే మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా, బాణాల ములుకుల అంపశయ్య దొరికింది. జటాయువు సీతమ్మను రావణుడు తీసుకెళుతుంటే అడ్డుకున్నాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కాబట్టి చనిపోతున్నప్పుడు అతనికి శ్రీరాముడి ఒడి పాన్పుగా మారింది. తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో, వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు జటాయువులా కీర్తి సంపాదిస్తారు.

Share this post with your friends