సుప్రభాత సేవతో ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో సీతా జ‌యంతి ప్రారంభం..

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో ఇవాళ సీతా జ‌యంతి ఉత్సవాలు వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేస్తారు. దీనిలో భాగంగా నేటి సాయంత్రం 5 నుంచి 6 గంట‌ల వ‌ర‌కూ ఆల‌యంలోని రంగ మండ‌పంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేపు చేస్తారు. అనంత‌రం విష్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, ఆరాధ‌న, నిర్వహిస్తారు. ప్రత్యేకంగా సీత‌మ్మవారికి “వాసంతిక పూజ” మ‌ల్లె పూల‌తో స‌హ‌స్రనామ అర్చన శాస్త్రోక్తంగా నిర్వహించ‌నున్నారు.

ప్రాశ‌స్త్యం :

శ్రీ రామ‌చంద్రమూర్తి వారు చైత్రమాసం శుక్లప‌క్షం న‌వ‌మినాడు జ‌న్మించారు. ఒక నెల త‌రువాత శ్రీమహాలక్ష్మి అవతారమైన సీతాదేవి వైశాఖ మాసం శుక్లప‌క్షం న‌వ‌మినాడు స్వామివారు ఆవిర్భవించారు. జ‌న‌క మ‌హారాజు యాగము చేస్తూ.. భూమిని దున్నుతుండగా నాగలికి ఒక పెట్టెలో పసిపిల్లగా సీత‌మ్మ వారు అవిర్భవించారు. ఆల‌యంలో ల‌భించిన శాస‌నాల ద్వారా 11వ శ‌తాబ్ధం నుంచి ఈ ప‌ర్వదినాన సీతా జ‌యంతి నిర్వహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని అర్చకులు తెలిపారు.

Share this post with your friends