దసరా ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఈ ఆలయ విశిష్టతేంటో తెలిస్తే..

ప్రతి సంవత్సరం దసరా పండుగను ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. ఈ క్రమంలోనే నేడు దేశమంతా దసరా పండుగను జరుపుకుంటోంది. పురాణాల ప్రకారం ఆశ్వయుజమాసం శుక్ల పక్షం పదవ రోజున శ్రీరాముడు రావణుని సంహరించాడని అంటారు. అందుకే ఈ పండుగనాడు రావణుడితో పాటు మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. అయితే కాన్పూర్‌లోని ఓ ఆలయాన్ని పదసరా పండుగ రోజు మాత్రమే తెరుస్తారు. మరి ఆ ఒక్కరోజు ఎవరిని పూజిస్తారో తెలిస్తే షాకవుతారు. ఆ ఆలయ కథేంటో తెలుసుకుందాం.

కాన్పూర్‌లోని ఖాస్ బజార్, శివాల, పట్కాపూర్‌లో ఉంది ఉన్న ఆలయం ఎవరిదో కాదు.. రావణాసురుడి ఆలయం. దీనిని 1868లో మహారాజ్ గురు ప్రసాద్ నిర్మించారు. దసరా రోజున దేశ వ్యాప్తంగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తే ఈ ఆలయంలో మాత్రం ఈ ఒక్కరోజున ఆలయాన్ని తెరిచి రావణుడిని పూజిస్తారు. దీనికి కారణం.. రావణుడు గొప్ప పండితుడు మాత్రమే కాకుండా దైవిక శక్తులు కలిగి ఉన్నాడని వీరంతా నమ్ముతారు. అందుకే ఇక్కడి ఆలయంలో తెల్లవారుజాము నుంచే రావణుడికి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

Share this post with your friends