ఇవాళ టీటీడీ పరిపాలనా భవనంలో గోదా కల్యాణం

ధనుర్మాసం ముగిసిన మరుసటి రోజైన జనవరి 15వ తేదీ బుధవారం అంటే ఇవాళ సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో గోదా కల్యాణం జరగనుంది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. గోదా కళ్యాణాన్ని వీక్షించాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎస్వీబీసీలో భక్తులు గోదా కల్యాణాన్ని వీక్షించవచ్చు.

శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు వేడుకగా కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలతో ముగుస్తుంది. భక్తులు ఈ కల్యాణంలో పాల్గొని స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది. నేటి ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 15న అత్యంత ఘనంగా జరగనుంది.

Share this post with your friends