ఇక్కడి గుడిని నీటితో నింపకుంటే అగ్ని ప్రమాదం తప్పదట..

దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని శివాలయాలు చాలా ప్రత్యేకం. అలాంటి వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ శివాలయం పూజా సంప్రదాయాల కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడి పూజా సంప్రదాయాలు ఇతర ఆలయాలకు చాలా భిన్నంగా ఉంటాయి. అదేంటంటే.. ఇక్కడి శివయ్యకు జలానికి బదులుగా పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితి. ఈ సంప్రదాయం ఈనాటిది కాదు. త్రేతాయుగానికి పూర్వం నుంచే వచ్చింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం కూడా ఒకటి ఉంది.

అదేంటంటే.. గుడిని నిత్యం నీటితో నింపాలి. లేదంటే ఆ పరిసరాల్లో తప్పనిసరిగా అగ్నిప్రమాదం జరిగి ప్రమాదాలు సంభవిస్తాయని స్థానికుల నమ్మకం. ఈ ఆలయం పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో ఉంది. ఈ ఆలయంలో ఒక శివలింగం కాదు.. మరో శివలింగం కూడా కనిపిస్తుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడట. ఇక్కడ శ్రీరాముడు, సీతాదేవి నత్తగుళ్లలు, ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్టించారట. అందుకే ఈ ప్రాంతానికి నత్తా రామేశ్వరంగా పేరు వచ్చింది. అయితే మరో శివలింగాన్ని లక్ష్మణుడు, ఇంకో శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్టించాడట. కాబట్టి ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రమని పిలుస్తారు.

Share this post with your friends