తిరుమల.. ఏప్రిల్‌ నెలలో నమోదైన వివరాలు..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంద‌ని, అందుకు త‌గ్గ‌ట్టు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఈవో శ్రీ ఏవి.ధ‌ర్మారెడ్డి పునరుద్ఘాటించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియా సమావేశంలో ఏప్రిల్ నెలలో భక్తులకు సంబంధించిన దర్శనం మరియు ఇతర వివరాలను తెలిపారు.

* శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య “20.17 లక్షలు”

* హుండీ కానుకలు “రూ.101.63 కోట్లు”

* విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య “94.22 లక్షలు”

* అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య “39.73 లక్షలు”

* తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య “8.08 లక్షలు”

Share this post with your friends