కైలాస్ మానస సరోవర యాత్రకు డేట్ ఫిక్స్

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం స్తంభించిపోయింది. ఆ తరువాత అంతా సెట్ అయిపోయింది. ప్రపంచం యథావిధిగా పరుగులు తీస్తోంది కానీ కైలాస మానస సరోవర యాత్ర మాత్రం ప్రారంభం కాలేదు. దాదాపు ఐదేళ్లుగా మానస సరోవర యాత్ర నిలిచిపోయింది. ఇన్నాళ్లకు భక్తులకు తీపి కబురు అందింంది. మానస సరోవర యాత్రకు డేట్ ఫిక్స్ అయ్యింది. జూన్ 30 నుంచి తిరిగి ప్రారంభం అవుతుందని అధికారిక సమాచారం వచ్చేసింది. ఈ యాత్రకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఈ యాత్రలో డేట్ డిసైడ్ చేశారని తెలుస్తోంది.

కైలాస్ మానససరోవర్ యాత్ర అనేది వ్యయ ప్రయాసలతో కూడుకున్న యాత్ర. అయినా కూడా భక్తులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని భావిస్తారు. లఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లాలో 17,000 అడుగుల ఎత్తులో ఉన్న లిపులేఖ్ కనుమ గుండా ఈ యాత్ర సాగుతుంది. శివుని నివాసమైన కైలాస పర్వతానికి వెళ్లడాన్ని మించింది మరొకటి లేదని హిందువుల భావన. కైలాస్ శిఖర ప్రదక్షిణ చేసి అక్కడి మానస సరోవరంలో స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల భావన. అలాంటి యాత్రకు మార్గం సుగమం అయ్యిందంటే భక్తకోటి సంతోషించకుండా ఉంటుందా?
రెట్టింపు ఆనందంతో యాత్రకు పయనమవుతుంది.

Share this post with your friends