మే 21 నుంచి రిషికేష్‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

రిషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో మే 21 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు 21 నుంచి 29వ తేదీ వరకూ వైభవంగా జరుగనున్నాయి. మే 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం మే 20వ తేదీ సాయంత్రం సేనాధిప‌తి ఉత్స‌వం, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించనున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారి వాహ‌న సేవ‌లు నిర్వహిస్తారు.

స్వామివారి వాహన సేవలు..

21-05-2024
ఉదయం – ధ్వజారోహణం,
సాయంత్రం – పెద్ద‌శేష వాహ‌నం

22-05-2024
ఉదయం – చిన్న‌శేష వాహ‌నం,
సాయంత్రం – హంస వాహనం

23-05-2024
ఉదయం – సింహవాహనం,
సాయంత్రం – ముత్య‌పుపందిరి వాహ‌నం

24-05-2024
ఉదయం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం,
సాయంత్రం – స‌ర్వ‌భూపాల వాహ‌నం

25-05-2024
ఉదయం – మోహిని అలంకారం,
సాయంత్రం – గ‌రుడ‌వాహ‌నం

26-05-2024
ఉదయం – హ‌నుమంత వాహ‌నం,
సాయంత్రం – గ‌జ‌వాహ‌నం

27-05-2024
ఉదయం – సూర్యప్ర‌భ వాహ‌నం,
సాయంత్రం – చంద్ర‌ప్ర‌భ వాహ‌నం

28-05-2024
ఉదయం – ర‌థోత్స‌వం,
సాయంత్రం – అశ్వ‌వాహ‌నం

29-05-2024
ఉదయం – చ‌క్ర‌స్నానం,
సాయంత్రం – ధ్వజావరోహణం

Share this post with your friends