పరికరాలను పూజించే సంప్రదాయం ఎలా మొదలైందంటే..

ఆశ్వయుజ శుక్లపక్షం తొమ్మిది రోజులనూ దసరా లేదా దేవీ నవరాత్రులు అంటారు. చివరి మూడు రోజులు ప్రత్యేకంగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ మూడు రోజులకూ అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజుల్లో విద్యార్థులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్ల పూజ, క్షత్రియులు ఆయుధ పూజ చేసి అమ్మవారి కృపను పొందుతారు. పురాణాల్లో రాజులు దేవి మహిషాసురమర్దనిగా విజయం సాధించిన స్ఫూర్తితో ఈ రోజునే దండయాత్రలు ప్రారంభించేవారని చెప్పబడింది.

అసలు పరికరాలను పూజించే సంప్రదాయం ఎలా మొదలైందో తెలుసా? దుర్గాష్టమి నాడు అమ్మవారు లోహుడు అనే రాక్షసుడిని సంహరించగా లోహ పరికరాలను పూజించే ఆచారం ప్రారంభమైంది అని చెబుతారు. “దుర్గ” అంటే – దుర్గతులను తొలగించేది. ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం. ‘గ’ అంటే వాటిని నశింపచేసేది. అందుకే ఈరోజు దుర్గాసహస్రనామ పారాయణం, “దుం” బీజాక్షరంతో అమ్మవారి పూజ ప్రత్యేకం. ఈసారి దుర్గాష్టమి మంగళవారంతో కలవడంతో మరింత శ్రేష్టత ఉంది.

Share this post with your friends