దేవీపురం సహస్రాక్షి రాజరాజేశ్వరి ఆలయ విశేషాలేంటంటే..

అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురం సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో పూజారులంటూ ఎవరూ ఉండరు. స్థానిక రైతులు, మహిళలు కొందరు కలిసి శ్రీ విద్యా పూజా విధానాన్ని నేర్చుకుని ఇక్కడ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయంలో తొలి ప్రాధాన్యం రైతులకు ఉంటుంది. అయితే ఎవరైనా పూజాలుగా వ్యవహరించవచ్చు. శివాలయంలో ఒకేసారి 1000 మంది కూర్చుని పూజలు చేసుకునేలా శివలింగాలుంటాయి. అలాగే ఈ క్షేత్రంలో నిత్యపూజలతో పాటు చండీహోమం, నవావరణ అర్చన, రుద్రాభిషేకం వంటివి నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకుని ఏం కోరుకున్నా జరుగుతుందట.

దేవీపురం సహస్రాక్షి రాజరాజేశ్వరి ఆలయ విశేషాలేంటంటే..
దేవీపురం సహస్రాక్షి రాజరాజేశ్వరి ఆలయ విశేషాలేంటంటే..

ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తికమాసం, దేవీనవరాత్రుల సమయంలో పెద్దఎత్తున విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మాయిల కోసం గురుకుల పాఠశాల కూడా ఉంది. అదే అమృతకన్య గురుకుల పాఠశాల. శ్రీ విద్యా ట్రస్టు నేతృత్వంలో ఈ పాఠశాల నడుస్తోంది. ఔత్సాహికులకు చదువుతోపాటు అమ్మవారి సాధనపట్ల కూడా అవగాహన సైతం కల్పిస్తారు. అలాగే మహిళలకు పలు అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఆర్థికంగానూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వెళ్లాలంటే అనకాపల్లికి వెళ్లి అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో గుడికి చేరుకోవచ్చు.

Share this post with your friends