హైందవ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించుకునే ఈ మహా పర్వదినాన భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున అన్నం లేదా బియ్యంతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవడం నిషిద్ధం. అలాగే తులసి ఆకులను కూడా కోయకూడదు. పగటి నిద్ర, కఠినమైన మాటలు, కోపం, ద్వేషం వంటివి వ్రత ఫలాన్ని నశింపజేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారాన్ని పూర్తిగా వదిలేయాలి. ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించకుండా శారీరక సుఖాలకు కోరుకుంటే పుణ్యం దక్కదని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేసి, హరినామ స్మరణలో గడిపితే సకల పాపాలు తొలగి శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

