తిరుమల శ్రీవారి భక్తులకు నిజంగా ఆనందం పంచే శుభవార్త ఇది. రోజురోజుకు బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, స్వామివారి డాలర్లు మాత్రం మార్కెట్ కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. అఖిలాండం ఎదురుగా ఉన్న కౌంటర్లో టీటీడీ స్వయంగా విక్రయిస్తుండటంతో భక్తుల్లో విశ్వాసం మరింత పెరిగింది. 2, 5, 10 గ్రాముల బంగారు డాలర్లు, 5, 10, 50 గ్రాముల వెండి డాలర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ ధరతో పోలిస్తే వేల రూపాయల తేడా ఉండటంతో, స్వామివారి అనుగ్రహంగా భావిస్తూ భక్తులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో భక్తునికి ఒక డాలర్ మాత్రమే ఇవ్వడం వల్ల అందరికీ అవకాశం కలుగుతోంది. అలంకారంగా కాకుండా ఆశీర్వాదంగా భావించి ఇంటికి తీసుకెళ్తున్న ఈ డాలర్లు, భక్తి తో పాటు భరోసాను కూడా అందిస్తున్నాయి. ధర కాదు, శ్రద్ధే అసలైన విలువ అనే భావనను స్వామివారు మరోసారి గుర్తు చేశారు.

