టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు

తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మే 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 160 దేవాలయాల్లో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఏపీలోని 79, తెలంగాణలోని 81 దేవాలయాలలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా స్వామి వారికి అభిషేకము, ఆకుపూజ , భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. సదరు ఆలయాలలో మనగుడి కార్యక్రమంలో భాగంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

‘మన గుడి’ కార్యక్రమంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశేష పర్వ రోజులలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా దళిత, గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో నిర్మించిన 315 భజన మందిరాలలో మన గుడి కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విదితమే. ఇవాళ శ్రీ హనుమాన్ జయంతి కావడంతో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. హనుమంతుడి జయంతి ఏడాదిలో రెండు సార్లు నిర్వహించుకోవడం ఆనవాయితి. ఈ క్రమంలోనే శ్రీరామనవమి తర్వాత ఒకసారి.. ఇవాళ మరోసారి జరుపుకోనున్నాం.

Share this post with your friends