పొంగు శనీశ్వరుడి ప్రత్యేకతలు ఏంటంటే..

తమిళనాడు తిరువారూర్ జిల్లాలోని తిరుక్కొళ్లికాడులో కొలువుదీరిన శనీశ్వరుడు అత్యంత మహిమ కలవాడని అంటారు. ఇక్కడి శనీశ్వరుడిని పొంగు శనీశ్వరుడిగా పేర్కొంటారు. అవడానికి ఇది శని దేవాలయమైనప్పటికీ మూలమూర్తిగా ఇక్కడ పరమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. వందల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అగ్నీశ్వరర్ ఆలయంగా కూడా పిలుస్తారు. తిరువారూర్ పొంగు శనీశ్వర దేవాలయాన్ని చోళ రాజులు నిర్మించినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. పూర్వం నల మహారాజు ఈ ఆలయాన్ని దర్శించుకున్నాడని చెబుతారు.

పొంగు శనీశ్వరుడి ప్రత్యేకతలు ఏంటంటే..
పొంగు శనీశ్వరుడి ప్రత్యేకతలు ఏంటంటే..

నల మహారాజును ఏలిన నాటి శని కారణంలో ఎన్నో బాధలు అనుభవించాడట. ఆ సమయంలో నలుడు శని, ఈశ్వరులను పూజించడం వలన శని బాధల నుంచి ఉపశమనం పొందినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఆలయంలోని శనీశ్వరుడు తన వాహనమైన కాకితో దర్శనమిస్తాడు. ఒక చేతిలో నాగలి ధరించి మరో చేయి తనను దర్శించుకున్న భక్తులకు అభయమిస్తున్నట్టుగా ఉంటుంది. ఆలయంలో మహాలక్ష్మి సన్నిధికి సమీపంలో ఉన్న కుబేర స్థలంలో పొంగు శనీశ్వరుడు కొలువుదీరాడు. ఈ శనీశ్వరుడిని దర్శిస్తే శని దోషాలు తొలగడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధించి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని విశ్వాసం.

Share this post with your friends