Telangana Tirupati : మొండిరోగాలను సైతం చిటికెలో నయం చేసే వేంకటేశ్వరుడు…తెలంగాణలో ఎక్కడ వెలిశాడో తెలుసా?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు భక్తుల కష్టాలను కరుణతో తీర్చే కరుణామూర్తి. తిరుమలలో మాత్రమే కాదు, భక్తుల కోరిక మేరకు అనేక ప్రాంతాల్లో స్వయంగా వెలిసి వారి బాధలను తొలగిస్తున్నాడు. అలాంటి పవిత్ర క్షేత్రమే తెలంగాణలోని నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా జమలాపురం సమీపంలో, పచ్చని కొండల మధ్య ప్రశాంత వాతావరణంలో వెలసిన ఈ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు “తెలంగాణ తిరుపతి”గా పిలుస్తారు. పూర్వకాలంలో ఒక సాధువుకు వచ్చిన కుష్టు వ్యాధి వేంకటేశ్వర స్వామి కృపతో పూర్తిగా నయమైందన్న గాథ ఈ క్షేత్రానికి మహిమను తెచ్చింది. స్వప్నంలో దర్శనమిచ్చిన స్వామి, గుహలో తిరునామం రూపంలో వెలిసినట్టు చెప్పడంతో అక్కడ స్వయంభువుగా వెంకటనాథుడు ప్రత్యక్షమయ్యాడని విశ్వాసం. అప్పటి నుంచే ఈ స్వామిని దర్శిస్తే మొండి రోగాలు సైతం తొలగిపోతాయని భక్తుల నమ్మకం. భక్తితో అడుగు పెడితే, వేంకటేశ్వరుడు తప్పక కరుణ చూపుతాడన్నది ఇక్కడి భక్తుల విశ్వాసం.

Telangana Tirupati
Telangana Tirupati
Share this post with your friends