సాధారణ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్..

దేశంలోని అన్ని దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహణ ఆదర్శమని టీటీడీ అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌లో మంగళవారం సాయంత్రం జరుగుతున్న మూడు రోజుల అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ ఎక్స్‌పోలో రెండవ రోజు సాయంత్రం అదనపు ఈవో 35 నిమిషాలపాటు టీటీడీ చరిత్ర, పాలన, శ్రీవారి దర్శన నిర్వహణ, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగులు, సిబ్బంది, టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వివిధ సంస్థలు, ట్రస్టులు, ఇతర సేవల గురించి పూర్తి సమాచారాన్ని అందించారు. టీటీడీ అందిస్తున్న సేవలపై చూపరులను, ఆహ్వానితులను ఆకట్టుకుంది.

అదనపు ఈవో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమలకు సంవత్సరంలో సగటున 2.50 కోట్లు భక్తులు వస్తున్నారు.

టీటీడీలో 66 శాఖలు ద్వారా భక్తులకు విస్తృతంగా సేవలు

సరాసరి రోజుకు 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు

భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలు, పారిశుధ్య సౌకర్యాలు తదితర సేవలు అందిస్తున్నాం

తిరుమలలో భక్తులు వేచియుండేందుకు 63 వెయిటింగ్ కంపార్ట్‌మెంట్‌లు

చక్కగా రూపొందించబడిన క్యూ లైన్ వ్యవస్థ

రోజులో ఎక్కువ శాతం సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు సమయం కేటాయించాం

భక్తులకు సాధారణ దర్శన సమయం దాదాపు 12 గంటలు, శనివారాలు మరియు ఆదివారాల్లో 17 గంటలకు పైగా ఉంటుంది.

భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, రోజువారీ వచ్చే భక్తుల సంఖ్య ఆధారంగా దర్శన ప్రణాళికలు మారుతుందన్నారు

సుమారు 60 వేల మంది యాత్రికులకు వసతి కల్పించే 7600 గదులు, 5 పీఏసీలు ఉన్నాయి

తిరుమలలో ప్రతిరోజూ సగటున 80 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నాం

భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు మూడు వంటశాలలు

ప్రతిరోజూ 3.5 లక్షల లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచబడతాయి

శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య సేవలు అందించటమే కాకుండా వివిధ ధార్మిక – సామాజిక-సంక్షేమ కార్యకలాపాలను కూడా టీటీడీ నిర్వహిస్తుందని అదనపు ఈవో వివరించారు. టీటీడీ కేవలం ఆలయ పరిపాలనకే పరిమితం కాదు, విస్తృత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని విస్తృతంగా తీసుకెళ్లేందుకు అన్నమాచార్య, దాస సాహిత్యం, ఆళ్వార్ దివ్యప్రబంధం, హిందూ ధర్మ ప్రచార, ఇతర ప్రాజెక్టులు ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం

తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్

ఆరు భాషలలో సప్తగిరి మాసపత్రిక

వైద్యం సేవలు

14 ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు

పారిశుధ్యం

ప్రతిరోజు 1914 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు, 207 టాయిలెట్ బ్లాక్‌లు ఉన్నాయి, ప్రతిరోజూ 90 టన్నుల వ్యర్థాల చెత్త ప్రోగు అవుతుంది

రవాణా

తిరుమలలో భక్తులకు ధర్మ రథం ద్వారా ఉచిత రవాణా అందిస్తున్నాం

తిరుపతి నుండి ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులు ద్వారా సాధారణ భక్తులు తిరుమల చేరుతున్నారు. దాదాపు 1600 ఆర్టీసీ బస్సులు సేవలందిస్తున్నాయి

ప్రత్యేక సందర్భాలలో 2400 ఆర్టీసీ బస్సుల సేవలు

విద్య

35 విద్యా సంస్థలలో దాదాపు 20 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

దేశవ్యాప్తంగా 61 దేవాలయాలు ఉన్నాయి

04 గోసంరక్షణ శాలలు

వేద మరియు వారసత్వ సంరక్షణతో సహా 08 ట్రస్టులు ఉన్నాయి

7000 మంది రెగ్యులర్ ఉద్యోగులు భక్తులకు సేవలు అందిస్తున్నారు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, శ్రీవారి సేవ వాలంటీర్లు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్నారు

సామాజిక కార్యకలాపాలు

కుష్ఠురోగులకు ఎస్వీ పేదల గృహం, వృద్ధులు, నిరాదరణకు గురైన వారికి కరుణాధామం, అనాధలకు విద్య , వసతి, భోజనంతో ఎస్వీ బాలమందిరం-, చెవిటి మరియు మూగ పాఠశాల, ప్రత్యేక సామర్థ్యం ఉన్న విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కళాశాల

టిటిడి అన్ని సేవలను డిజిటలైజేషన్ ద్వారా ముందుకు సాగుతోందని, రాబోయే రెండు మూడు సంవత్సరాలలో మరింతగా డిజిటలైజేషన్ ను వినియోగించి సేవలు అందిస్తామన్నారు. భక్తులకు పారదర్శక సౌకర్యాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఐటీ కార్యకలాపాలను జోడించి 100% సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ముగించారు.

Share this post with your friends