టీటీడీకి రూ.కోటి విరాళం

ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. అదే రాష్ట్రానికి చెందిన బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కంపెనీల ప్రతినిధి శ్రీ వై.రాఘవేంద్ర విశ్వకర్మ విరాళం డీడీలను అందజేశారు.

టీటీడీకి రూ.30 లక్షలు విరాళం

బెంగుళూరుకు చెందిన శ్రీ బీఎంకే నగేష్ అనే భక్తుడు సోమవారం ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.30 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా విరాళం డీడీలను అందజేశారు.

Share this post with your friends