టీటీడీ కల్యాణ వేదిక కోసం ఎలా బుక్ చేసుకోవాలంటే..

తిరుమలలోని కల్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుంచి నూతన వదూవరులకు టీటీడీ కల్పించింది. ఇందుకోసం తమ సమీప ప్రాంతాల్లోని నెట్ సెంటర్‌లో టీటీడీ వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలంలో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదుచేయాలి. వధూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక ఆధార్ కార్డులను అప్లోడ్ చేయాలి.

వయసు ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా పదో తరగతి మార్క్లిస్ట్ / ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికేట్ లేదా పంచాయతీ కార్యదర్శి/ మునిసిపల్ అధికారుల నుండి బర్త్ సర్టిఫికెట్‌ను జత చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్లోడ్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ పత్రం జారీ అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకునే వారు అకనాలెడ్జ్‌మెంట్ పత్రాన్ని తీసుకుని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణ వేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.

Share this post with your friends