వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ కీలక నిర్ణయాలు

2025 జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు

⁠వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ.

పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి.

కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు తిరుమలకు అనుమతి.

⁠ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

⁠చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు.

గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.

వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు.

⁠భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు.

⁠ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకుని అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ గా ఉంచుకునేందుకు చర్యలు.

⁠పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లకు ఆదేశం.

ముఖ్యమైన ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు.

చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు.

విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు.

భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగు నీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ.

⁠వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు. పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు.

తిరుమలలో శోభాయమానంగా విద్యుద్దీపాలు, పుష్పాల అలంకరణపై ప్రత్యేక దృష్టి.

మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్&గైడ్స్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగం.

Share this post with your friends