టీటీడీకి 100 సైకిళ్లు విరాళం

తిరుమల శ్రీ మలయప్ప స్వామివారికి ఏదో ఒక విరాళం అందుతూనే ఉంటుంది. స్వామివారికి మొక్కుకుని కోరిక నెరవేరిన అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో తాము అనుకున్నది అందజేస్తూ ఉంటారు. వ గురువారం చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియా సంస్థ 100 సైకిళ్లు విరాళంగా అందజేసింది. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులు సైకిళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇన్‌ఛార్జ్ డిఐ శ్రీ హరి బాబు పాల్గొన్నారు.

శ్రీవారి వార్షిక వసంతోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. వసంత బుతువులో మూడు రోజుల పాటు కన్నుల పండువగా ఈ ఉత్సవం జరుగుుతంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 10వ తేదీన ఈ వార్షిక వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఆలయం వెనుక ఉన్న వసంత మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా చైత్రశుద్ధ త్రయోదశి రోజున మొదలై చైత్ర పూర్ణిమ రోజు ముగుస్తాయి.

Share this post with your friends