అక్షయ తృతీయ రోజున రాశి ప్రకారం వస్తువులను కొనుగోలు చేస్తే చాలా మంచిదని చెబుతారు. ఇప్పుడు ఏ రాశివారు ఏ వస్తువులను కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారు వీలైతే బంగారం.. లేదంటే ఏదైనా చిన్న ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.
వృషభం: ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్రుడికి సంబంధించిన వెండి వస్తువులు లేదంటే ఆభరణాలను కొనుగోలు చేస్తే చాలా మంచిదట.
మిథున రాశి: ఈ రాశి వారు స్తోమతకు అనుగుణంగా బంగారం కొనుగోలు చేయాలనుకుంటే.. బంగారు గొలుసు లేదా చెవిపోగులు కొంటే చాలా మంచిది.
కర్కాటకం: ఈ రాశివారికి అధిపతి చంద్రుడు. వెండి అనేది ఆయనకు సంబంధించినదే కాబట్టి ఈ రాశి వారు వెండి కొనుగోలు చేస్తే మంచిది.
సింహ రాశి: సింహ రాశి వారు బంగారం కొనడం చాలా శుభప్రదం కాబట్టి బంగారు లాకెట్ లేదంటే గొలుసు కొనుగోలు చేయవచ్చు.
కన్య రాశి : ఈ రాశివారు బంగారు గాజులు, ముక్కు పుడక లేదా ఉంగరం కొనడం వల్ల కెరీర్లో విజయం సిద్ధిస్తుంది.
తుల రాశి: ఈ రాశి వారు ముఖ్యంగా వెండి పట్టీలు కొని లక్ష్మీ దేవికి సమర్పించిన అనంతరం ధరిస్తే వైవాహిక జీవితం బాగుంటుందట.
వృశ్చిక రాశి: ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి బంగారు ముక్కు పుడక లేదా ఉంగరం కొనడం శుభప్రదం. అయితే పరిమిత పరిమాణంలో బంగారాన్ని ఉపయోగిస్తే మంచిది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి బంగారాన్ని ఒంటిపై ధరిస్తే చాలా మంచిది.
మకర రాశి, కుంభ రాశి: ఈ రెండు రాశుల అధిపతి శనీశ్వరుడు కాబట్టి ఆయనకు సంబంధించిన వెండిని కాళ్ల పట్టీలుగా ధరిస్తే మంచిది.
మీనం రాశి: ఈ రాశికి అధిపతి బృహస్పతి కాబట్టి ఆయనకు సంబంధించిన బంగారు వస్తువులను కొనడం శుభప్రదం.