మహా కుంభమేళా ఎక్కడెక్కడ జరుగుతుంది? నెక్ట్స్ ఎప్పుడు?

కుంభమేళా అనేది హిందువులకు అతి పవిత్రమైన సంస్కృతికి అద్దం పట్టే యాత్ర. సాధారణ కుంభమేళా అయితే నాలుగేళ్లకోసారి.. అర్థ కుంభమేళా ఆరేళ్లకోసారి హరిద్వార్ లేదంటే ప్రయాగలలో జరుగుతంది. ఇక పూర్ణ కుంభమేళా అనేది 12 ఏళ్లకోసారి జరుగుతుంది. ఇలాంటి పూర్ణ కుంభ మేళాలు 12 పూర్తైతే అంటే 144 ఏళ్లకోసారి అలహాబాద్‌లో మహా కుంభమేళా నిర్వహిస్తారు. ముఖ్యంగా దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ కుంభమేళ జరగుతూ ఉంటుంది. అవేంటంటే.. హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయిని. ఈ ప్రాంతాల్లో మాత్రమే మహా కుంభమేళాను నిర్వహిస్తారు.

ఇక చివరిసారిగా మహా కుంభమేళా 2013లో జరిగింది. ఇక తదుపరి కుంభమేళా వచ్చే ఏడాది అంటే 2025లో జరగనుంది. కుంభమేళా చరిత్ర ఈనాటిది కాదు.. 850 ఏళ్ల నాటిదట. దీనిని తొలుత ఆది శంకరాచార్యులు ప్రారంభించారని ప్రతీతి. ఈ మహా కుంభమేళాలో పాల్గొంటే మన పాపాలన్నీ తీరిపోయి మంచి జరుగుతుందని నమ్మకం. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. ఇక గ్రహాల స్థానాలను బట్టి కుంభమేళా తేదీలను నిర్ణయిస్తూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు.

Share this post with your friends