ఛోటీ దీపావళి పూజా శుభ సమయం ఏంటి?

ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున మనం ఛోటీ దీపావళి పండుగను జరుపుకుంటాం. ఈ పండుగను చాలా ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ధన త్రయోదశితో మొదలై అన్నాచెల్లెళ్ల పండుగతో దీపావళి ముగుస్తుంది. ఛోటీ దీపావళి నాడు మృత్యుదేవతగా పరిగణించబడే యమ ధర్మ రాజుని పూజిస్తారు. ఈ రోజున యమ ధర్మరాజును పూజిస్తు కుటుంబంలోని వ్యక్తులంతా అకాల మృత్యు దోషం నుంచి బయటపడతారని నమ్మకం. ఈ రోజు సాయంత్రం యమ దీపం అని పిలువబడే దీపాన్ని వెలిగించి దక్షిణ దిశలో పెడతారు. ఇక మనం ఛోటీ దీపావళి పండుగను నేడే జరుపుకోబోతున్నాం.

పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి 30 అక్టోబర్ 2024న మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:11 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఛోటీ దీపావళి జరుపుకునేందుకు శుభ సమయం అక్టోబరు 30న సాయంత్రం 4:36 నుండి 6:15 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో యముడిని పూజించుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం. ఈ రోజున యమ దఱ్మరాజుతో పాటు హనుమంతుడిని సైతం పూజిస్తారు. ఇవాళ సాయంత్రం శుచిగా స్నానమాచరించి ధూప, దీపాలు వెలిగించి హనుమంతుడిని పూజించాలి.

Share this post with your friends