శని త్రయోదశి. అంటే శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. కర్మ ప్రదాతగా శనీశ్వరుడిని చెబుతారు. అంటే మన కర్మలకు అనుగుణంగా శిక్షలు విధిస్తాడని నమ్మకం. ఈ రోజున శనీశ్వరుడికి పూజలు నిర్వహిస్తే ఎలాంటి శని దోషాలున్నా తొలగిపోతాయని నమ్మకం. ప్రస్తుతం కొన్ని రాశుల వారు శనీశ్వరుడి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వారంతా తప్పని సరిగా దగ్గరిలోని శివాలయానికి వెళ్లి పూజ చేయించుకుంటే మంచిది. రేపు (మే 10)న శని త్రయోదశి. కాబట్టి ఈ రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి పూజ చేస్తే శని దోషాల నుంచి కొంత మేర విముక్తి లభిస్తుందట. మరి ఏ ఏ రాశుల వారు ఎలాంటి శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుందాం.
ప్రస్తుతం శనైశ్చరుడు మీన రాశిలో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిలో ఉన్న కుంభ, మీన, మేష రాశుల వారు తప్పని సరిగా దగ్గరలోని శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి పూజలు చేయించుకుంటే మంచిది. అలాగే ధనుస్సు రాశి వారికి అర్దాష్టమ శని నడుస్తోంది. సింహరాశి వారికి అష్టమ శని నడుస్తోంది. అలాగే శని ఆధిపత్య రాశులైన మకర, కుంభ రాశి వారు రేపు తప్పనిసరిగా ఆలయానికి వెళ్లి శనీశ్వరుడికి పూజ చేయాలి. సంపూర్ణ శని దోష నివారణకు 19 శనివారాలు పాటు శని పూజ నిర్వహించాలి. శనీశ్వరుని పూజ / లేదా మీ దగ్గరలోని నవగ్రహ ఆలయం లో ప్రదక్షిణలు చేసుకోవాలి. ఆపై శనీశ్వరుని ప్రీతి కోసం తప్పనిసరిగా తైలాభిషేకం చేయాలి.