శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయంలో వైభవంగా బాలయోగం..

నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయంలో నిన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 8:30 గంటలకు బాలయోగం, 10:30 గంటలకు ప్రబోధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు స్వామివారి కల్యాణం జరగనుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానున్నారు. కాగా.. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీన ప్రారంభమయ్యాయి. నిన్న ఉదయం 9 గంటలకు అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గరుడ ముద్ద, సాయంత్రం 7 గంటలకు భేరీ పూజ, దేవతావాహనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ బ్రహ్మోత్సవాలు జూన్ 18న ముగియనున్నాయి. 18న మహాపూర్ణాహుతి, చక్రస్నానంతోబ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ముగింపు పలకనున్నారు. ఈ ఆలయాన్ని 800 ఏళ్ల క్రితం నిర్మించారు. తమిళనాడు శ్రీరంగంలోని రంగనాయకాయక స్వామిని దర్శించుకున్న అప్పల దేశికుడు అనే వ్యక్తి ఆ విగ్రహాన్ని తలపించే విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయం నిర్మాణం గావించారు. కాకతీయుల కాలంలో వింజూరు వంశానికి చెందిన నరసింహాచార్యుల వారు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకున్నారట. అనంతరం అటువంటి ప్రతిమనే శ్రీపురం గ్రామంలో ప్రతిష్టించారని కూడా ప్రచారం జరుగుతోంది.

Share this post with your friends