హిందువులకు విష్ణుమూర్తి ప్రధాన దైవం. నిత్యం పూజించుకుంటారు. అయితే పూజలో పువ్వులు వాడటం సర్వసాధారణం. మరి విష్ణుమూర్తికి ఇష్టమైన పువ్వులేంటో తెలుసా? ఒక శ్లోకం స్వామివారికి ఇష్టమైన పుష్పాల గురించి చెబుతుంది. అదేంటో ముందుగా చూద్దాం.
అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః
జ్ఞాన పుష్పం తప: పుష్పం శాంతి పుష్పం తథైవ చ
సత్యం అష్ట విధం పుష్పో: విష్ణో హో ప్రీతి కరం భవేత్ !!
పై శ్లోకం ప్రకారం మొదటిది అహింసా పుష్పం. ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రథమ పుష్పం.
రెండవది ఇంద్రియ నిగ్రహం. చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.
3.దయ: కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.
4.క్షమ: ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ.ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.
5.ధ్యానం: ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం.ఇది దేవుని అందించే ఐదో పుష్పం.
6.తపస్సు: మానసిక (మనస్సు), వాచిక (మాట), కాయక(శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.
7.జ్ఞానం: పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.
8.సత్యం: ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.