1. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు… వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు. ఉదా: కౌరవులు
2. నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ… ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ… వాటిని “అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగమవడంతో పాటు నువ్వు కూడ వినాశనం అవుతావు. ఉదా: కర్ణుడు
3. యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే ‘వినాశం’ జరుగుతుంది. ఉదా:అశ్వత్థామ.
4. విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బతకవలసి వస్తుంది. ఉదా: భీష్ముడు
5. సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి వినాశం తప్పదు. ఉదా: దుర్యోధనుడు
6. స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం కలిగిన వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది. ఉదా: ధృతరాష్ట్రుడు
7. శక్తి యుక్తులకి, తెలివితేటలకి ధర్మం తోడైతే విజయం తప్పక లభిస్తుంది. ఉదా: అర్జునుడు.
8. ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం. ఉదా: శకుని
9. నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు, నీ వాళ్ళకి హానిచేయదు. ఉదా: యుధిష్ఠిరుడు
10. అందరి బంధువైనా… అన్నీ తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్యధర్మం కూడా. ఉదా: శ్రీకృష్ణుడు
11. కోటి కథల, లక్షల వ్యధల, వేల ఉపకథల, 100 మంది శత్రువుల, 5గురు మిత్రుల (అందరు సోదరులే)… నాలుగు ధర్మాల సారాంశమే భారతం