‘తిరుమల విజన్ – 2047’ లక్ష్యమేంటంటే..

“స్వ‌ర్ణాంధ్ర‌ విజన్ – 2047″కి అనుగుణంగా తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్ర‌ణాళిక‌తో “తిరుమల విజన్ – 2047” ను టీటీడీ ప్రారంభించింది. ఈ క్రమంలోనే తిరుమల విజన్ – 2047 లక్ష్యమేంటంటే.. తిరుమల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేయడం. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం. తిరుమలలోని ప‌విత్ర‌త‌ను కాపాడుతూ భ‌క్తుల‌ సౌకర్యాలను మెరుగుపరచడానికి భ‌విష్య‌ వ్యూహాలను రూపొందించడం.

వివరణాత్మక నివేదికలు(DPR)లు

ప్రాముఖ్య‌త క‌లిగిన‌ మౌలిక సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళికలను త‌యారు చేయ‌డం.

ప్ర‌తిపాద‌న‌ల‌కు గ‌డువు

మూడు వారాల్లోగా ఆసక్తి గల ఏజెన్సీల నుండి తమ ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా కోర‌డ‌మైన‌ది. ఇలాంటి భారీస్థాయి పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఏజెన్సీలకు ముంద‌స్తు అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.

ప్ర‌ణాళిక ల‌క్ష్యాలు

వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణ, ఆధునిక పట్టణ ప్రణాళికలను మిళితం చేసే ఒక బృహుత్త‌ర భవిష్య ప్ర‌ణాళికల‌ను రూపొందించ‌డం. తిరుమలలో రాబోవు త‌రాల్లో మ‌రింత‌గా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడట‌మే ప్రణాళిక‌ లక్ష్యం.

Share this post with your friends