ప్రయాగ్‌రాజ్‌లో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక ఊంజల్ సేవ

ప్రయాగ్ రాజ్లో మహా కుంభ మేళా పెద్ద ఎత్తున జరుగుతోంది. వసంత పంచమి సందర్భంగా కుంభమేళాలో పుణ్యస్నానమాచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజుకు కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలో స్నానమాచరిస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో తిరుమల తిరుపతి దేవస్థానం సైతం తన వంతు సాయం అందిస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో సోమవారం వసంత పంచమి పర్వదినం పురస్కరించుకుని సందర్భంగా శ్రీ శ్రీనివాస స్వామికి ప్రత్యేక ఊంజల్ సేవ నిర్వహించారు.

వేద పండితుల వేదమంత్రాల నడుమ శ్రీ స్వామివారు వీణాపాణియై సరస్వతి అలంకారంలో ఊయలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారి ఊంజల్ సేవ ను తిలకించి ఆనందంతో పరవశించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్, హెచ్ డీపీపీ అదనపు సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్, ఏఈవో శ్రీ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends