సలహాలు ఇవ్వగలిగేది పెద్దలే.. దీనికి సంబంధించిన కథేంటంటే..

అవంతీనగరంలో అరవై సంవత్సరాలు నిండిన వారిని చంపేయాలనీ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఆజ్ఞ జారీ చేశాడు. వృద్దులు పని చేయలేరని.. వాళ్ళ ఉపయెాగం లేదని అతని భావన.అంతే కాదు పాత వస్తువులు ఉండకూడదనీ… అవి శనికి సంకేతమని కూడా ఆదేశాలు జారీ చేశాడు. శని వుంటే రాజ్యానికి అరిష్టం అని భావించేవాడు. రాజ్యంలో చాలామంది తమ పుార్వీకుల జ్ఞాపకంగా దాచుకున్న పాతవిలువైన వస్తువులు విసిరి పారేయలేక చాలా మనస్తాపం పొందేవారు. కావున ఆ రాజ్యంలో వృద్దులు కానీ పాత వస్తువులు కానీ కనపడవు. శాంతమ్మకి ఈ మధ్య 60వ సంవత్సరం వచ్చింది. ఆమె కొడుకులు ఆమెను ఒక చోట రహస్యం గా భటులకి కనపడకుండా దాచి ఉంచారు.

ఒకనాడు అడవిలో సింహం ఒకటి ఊరిమీద పడి దొరికిన వారిని దొరికినట్లు దాడి చేయసాగింది. ప్రజలు భయబ్రాంతులైనారు.సింహం గర్జిస్తూ ఊరంతా అడవిలో తిరిగినట్లు తిరుగుతుంది. ప్రజలకు ఏమి చేయాలో తోచలేదు. దాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన భటులను అది దూకి చంపేసేది. శాంతమ్మకి విషయం తెలిసింది. కొడుకుల్ని పిలిచి సింహం పీడ విరగడ కావాలంటే… సున్నం నీళ్ళలో ముంచిన మేకపిల్లను ఆహారంగా వేయమనీ చెప్పింది. కొడుకులు ఆ పని చేశారు. ఆకలితో ఉన్న సింహం అమాంతం మేక పిల్లను తినేసింది. అది సున్నం తిన్నందు వలన కళ్ళు తిరిగి సృహ కొల్ల్పోయి పడిపోయింది. అప్పుడు భటులు వచ్చి దాని మీద వల వేసి పట్టుకొని బోనులో పెట్టారు.

ఇంత మంచి సలహా ఇచ్చిందెవరనీ రాజు విచారించాడు. శాంతమ్మ రహస్యంగా దాగిన విషయం తెలిసి రాజు ఆమె తెలివికి మెచ్చుకొని పెద్దలను వృద్దులను చంపకూడదని… వాళ్ళ సలహాలు సూచనలు అనుభవాలు విలువైనవనీ వృద్దుల అవసరం ఎంతో ఉందని.. వృద్దులను చంపే శాసనం రద్దు చేయించాడు. అంతే కాదు.. పుార్వీకులు జ్ఞాపకంగా దాచుకున్న వస్తువులు ఏదో ఒక సమయంలో ఉపయోగపడతాయనీ.. దాచుకోమనీ రాజు ఆఙ్గ జారీ చేశాడు. జీవిత సారం అంతా రంగరించి మంచి సలహాలు ఇవ్వగలిగేది పెద్దలేనని ఈ కథ ద్వారా తెలుస్తోంది.

Share this post with your friends