ఈ దేవాలయంలోని కోనేటికి ఉన్న విశిష్టత గురించి తెలిస్తే..

చిత్తూరు జిల్లాలోని ఆంజనేయుడు కొలువైన అర్థగిరి పర్వత కథ గురించి మనం తెలుసుకున్నాం కదా. కొండ పడిన ప్రాంతంలో వెలిసిన గ్రామమే అరకొండ.. కాలక్రమంలో అది కాస్తా అరగొండగా రూపాంతరం చెందింది. ఈ ఆలయం విశేషం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆలయంలోని కోనేటి గురించి తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి సంజీవ పర్వతాన్ని ఎత్తుకెళుతుండగా.. మృతసంజీవనీ ఔషధపు మొక్క ఆలయప్రాంగణంలో ఉన్న కోనేటి నీటిలో పడిందని చెబుతారు. అందుకనే ఈ నీటికి దివ్యఔషధగుణాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. కాబట్టే ఈ కోనేటిని సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు.

ఈ నీరు తాగడంతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా దీని నీటిని తాగినా మంచిదని చెబుతారు. సంజీవరాయ పుష్కరిణీ తీర్థాన్ని సేవిస్తే వ్యాధులు నయమవడమే కాకుండా మనసులోని కోరికలు సైతం నెరవేరుతాయట. సంజీవరాయ పుష్కరిణిలోని నీరు అనేక ఔషధ మొక్కలను తాకుతూ ప్రవహిస్తుంది కాబట్టి దీనిలోని చాలా తియ్యగా ఉంటుంది. ఈ కోనేటిలో నీరు చేరి వేలసంవత్సరాలు గడిచాయని చెబుతారు. దీనిలోని నీటిని సేవిస్తే చర్మ సంబంధిత వ్యాధులతో పాటు టీబీ, ఆస్తమా, కీళ్లనొప్పులు సహా అనేక వ్యాధులు ఇట్టే నయమవుతాయట. ఇలాంటి వ్యాధులు ఉన్నవారు పుష్కరిణిలో నీటిని‌ 40 రోజుల పాటు సేవించి ఇక్కడి ఆంజనేయస్వామిని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం.

Share this post with your friends