
నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మను వివిధ రూపాల్లో పూజించుకుంటూ ఉంటాం. అమ్మవారి పూజలో వాడకూడని పుష్పాలేంటో ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ పుష్పాన్ని వాడితే ఫలితం అద్భుతంగా ఉంటుందో తెలుసుకుందాం.
పద్మ పుష్పాలు: ఈ పుష్పాలతో నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతతతో పాటు పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందట.
గన్నేరు పూలు: అమ్మవారిని గన్నేరు పూలతో పూజిస్తే మంత్ర సిద్ధి త్వరగా కలుగుతుంగదట. సినీ, రాజకీయ, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లకు అమ్మవారిని గన్నేరు పూలతో పూజించడం వలన జనాకర్షణతో పాటు ప్రజాదరణ కలుగుతుందట.
సన్న జాజిపూలు: అమ్మవారిని సన్నజాజి పూలతో పూజితస్తే వాక్శుద్ది కలుగుతుందట.
తుమ్మిపూలు: అన్నపానాలకు లోటు లేకుండా ఉండాలంటే అమ్మవారిని తుమ్మిపూలతో పూజించాలట.
జిల్లెడు, ఎర్ర తామర పూలు: మన కోరికలు నెరవేరాలంటే జిల్లెడు పూలు, ఎర్ర తామర పూలతో అమ్మవారిని పూజించాలట.
పారిజాత పుష్పం: కాలసర్ప దోష తీవ్రతను తగ్గించుకోవడానికి పారిజాత పుష్పంతో అమ్మవారిని పూజించాలట.
ఎర్ర మందార పూలు: ఎర్ర మందారపూలతో అమ్మవారిని పూజిస్తే దిష్టి దోషాలు, అంతర్గత శత్రువుల బాధ తగ్గుతుందట.
