అసలు చండీయాగం ఎలా చేస్తారు?

వ్యాస మహర్షి తను రచించిన మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ ఏడు వందల శ్లోకాలు రాశారు. వాటిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చండీ సప్తశతి అని కూడా పేరుంది. యాగం చేసే ముందు హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావిస్తారన్న విషయం తెలిసిందే. ఆ తరువాత దుర్గాసప్తశతి మంత్రాలను జపిస్తూ చండీయాగం నిర్వహిస్తారు. దుర్గాసప్తశతి మాత్రమే కాకుండా నవాక్షరి వంటి మంత్రాలను సైతం జపిస్తారు. అయితే యాగంలో దుర్గాసప్తశతిని కానీ అందులోని ఎన్ని సార్లు వల్లెవేస్తూ హోమం చేస్తారనే దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీయాగం, ఆయుత అంటే పదివేలు చండీయాగం అని పిలుస్తారు.

పూర్వకాలంలో చండీయాగాన్ని చాలా ఎక్కువగా నిర్వహించేవారు. రాజులు ఎక్కువగా ఈ యాగం నిర్వహించేవారు. రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని, శత్రువులపై విజయం సాధించాలని ఈ యాగం చేసేవారు. ప్రస్తుత కాలంలో రాజ్యాలు పోయినా కూడా చండీయాగం మాత్రం నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ యాగం పట్ల ఉన్న నమ్మకం అలాంటిది. అందుకే ఇప్పటికీ పలువురు రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు. మొత్తానికి చండీయాగం వల్ల వచ్చే ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది.

Share this post with your friends