తులశమ్మకు హిందువులంతా అత్యధిక ప్రాధాన్యమిస్తారు. అసలు తులశమ్మకు పూజ చేయకుండా పచ్చి గంగైనా ముట్టని వారు చాలా మంది ఉన్నారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైనదే కాకుండా భగవంతుడు శాలిగ్రాముడిగా తులసి వేర్లలో నివసిస్తాడని నమ్మకం. అందుకే ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి పూజ చేసుకుంటారు. అసలు దీపం ఎందుకు తులశమ్మ దగ్గర వెలిగిస్తారో తెలుసుకుందాం. దీపం వెలిగించడం వల్ల ఇంటిలోని చెడు శక్తులు పోయి.. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదట. ఇక ఈ దీపాల్లో రకరకాలుంటాయి.
నెయ్యితో వెలిగించే దీపం పవిత్రతకు సంకేతం మాత్రమే కాకుండా లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుందట. కొందరు పిండితో చేసిన దీపాన్ని వెలిగిస్తారు. ఇలా చేస్తే చాలా మంచిదట. ఇంట్లో ఏవైనా సమస్యలున్నా.. నిత్యం గొడవలతో ప్రశాంతత లేకున్నా తులశమ్మ దగ్గర దీపం వెలిగిస్తే అన్నీ సెట్ అవుతాయట. తులసి మొక్క ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యానికి సైతం అనేక లాభాలున్నాయి. తులసి మొక్క గాలిని శుద్ది చేస్తుంది. తద్వారా మనకు మంచి గాలి అందుతుంది. తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు సైతం తొలగిపోతాయి. ఇంట్లో తులసి మొక్క ఉంటే శరీరానికి, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.