అసలు మనలో భగవంతుడు ఏం చూస్తాడనేది ఆసక్తికరం. ఆయన మన దగ్గర ఎంత సంపద ఉన్నదన్నది చూడడు… అందులో ఎంత ఆర్తులకు అందించావని చూస్తాడట. ఎన్ని శాస్త్రాలు చదివావు అనేది ఏనాడూ చూడడట.. అందులో ఎంత ఆచరించామన్నది మాత్రమే చూస్తాడట. ఎన్నెన్ని కార్యాలు చేసావన్నది చూడడట…అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారు అన్నది చూస్తాడట. ఎంత మంది మన చుట్టూ ఉన్నారన్నది చూడడట… మన కోసం ఎందరు నిలబడ్డారన్నది మాత్రమే చూస్తాడట.
ఎన్నేళ్ళు బతికావన్నది కాదు.. ఎలా బతుకును సార్థకం చేసుకున్నావు అన్నది భగవంతుడు చూస్తాడట. మన జ్ఞాపకం సంతోషాన్నివ్వాలి కానీ.. మన ప్రస్తుతం ప్రశాంతతనివ్వాలి మన స్మరణము ప్రేరణనివ్వాలన్నది మాత్రమే చూస్తాడు. మన మాట ఒకరికి ఓదార్పునిచ్చినప్పుడే జన్మ ధన్యమవుతుంది. అప్పుడు మాత్రమే చచ్చినా కూడా బతుకుతామట. అప్పుడు కదా పుట్టుక పుణ్యమయ్యేది మళ్ళీ పుట్టుకే లేని పనులు చేద్దాం.. మరొకరైనా మనకోసం ప్రార్థించేలా ఎవరో ఒకరైనా గుర్తుంచుకునేలా… కనీసం ఎప్పుడో అప్పుడు మంచి పని చేసేద్దాం. ఎదుటివాడి కన్నీరు తుడవకపోయినా పర్వాలేదు.. కానీ ఏ ఒక్కరి కన్నీరుకు కారణం కాకుండా బతికితేనే భగవంతుడి కరుణ మనపై ఉంటుంది.