శత్రువులను ఎలా జయించాలో చెప్పే ఈ శ్లోకం గురించి తెలుసా?

ప్రస్తుతం భారత్‌పై ఉగ్రదాడులు జరుగుతున్నాయి. శాంతించినట్టే శాంతించిన ముష్కరులు తిరిగి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అయినా భారత్ సైన్యం ముందు వారి ఆటలు సాగడం లేదు. అయితే యుద్ధంలో శత్రు సంహారం ఎలా గావించాలనే విషయమై ఓ శ్లోకం ఉంది. యుద్ధంలో ఖడ్గాన్ని ధరించి నరసింహ స్వామి వలే యుద్ధం చేయాలని.. దుష్ట సంహారం గావించాలని చెప్పే శ్లోకం గురించి తెలుసుకుందాం.

యుద్ధే శూరాః ఖడ్గపాణిః నృసింహసమవీర్యవాన్।
దస్యుజన్ఖలనాశాయ సైనికాః సింహవిక్రమాః॥
నృహరిర్యథా రక్షార్ధం హిరణ్యకశిపుంజహే।
తథైవ శత్రున్ శూరాః జయంతు భువనేతలే॥

అర్థం:

యుద్ధంలో ఖడ్గాన్ని ధరించి నరసింహ స్వామి వలె వీర్యవంతులై, దుష్టులను సంహరించేందుకు సైనికులు సింహప్రమాణమైన విక్రమంతో యుద్ధం చేయుగాక నృహరియైన నరసింహుడు హిరణ్యకశిపును సంహరించినట్లే, శత్రువులను ఈ భూమి మీద వీరోచితంగా జయించుగాక…

Share this post with your friends