ద్వాదశ ఆదిత్య దీపం గురించి తెలుసా?

భాను సప్తమి గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఏడాది రేపే (ఆదివారం) భానుసప్తమి రానుంది. ఈ సందర్భంగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే సాధారణ రోజుల్లో కంటే కొన్ని రెట్లు అదనంగా ఫలితం లభిస్తుంది. స్వామివారికి అర్ఘ్యం ఎలా సమర్పించాలో తెలుసుకున్నాం కదా. అర్ఘ్యం సమర్పించిన తర్వాత విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఇంట్లోని ఏదైనా గదిలో తూర్పు దిక్కులో పీట ఉంచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత బియ్యప్పిండితో ముగ్గు వేయాలి.

ఆ ముగ్గు మీద పెద్ద మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి అందులో నువ్వుల నూనె పోసి దానిలో పన్నెండు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. అంటే రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేయాలి. ఇలా 12 వత్తులను సిద్ధం చేసుకుని దీపం వెలిగించాలి. భానుసప్తమి రోజు ఉదయం ఆరు నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యలో, రాత్రి 8 నుంచి 9 గంట మధ్య దీపం వెలిగించేందుకు సరైన సమయం. ఈ సమయంలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకటింపావు కేజీల గోధుమలను ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టాలి. దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి గోధుమలను దానం ఇవ్వాల్సి ఉంటుంది.

Share this post with your friends