ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని వంటి శని దోషాలతో బాధపడేవారు కొన్ని శని దేవుని ఆలయాలను దర్శించుకుని పూజ చేసుకుంటే ఆ దోషం తొలగిపోతుందని తెలుసుకున్నాం కదా. ఈ క్రమంలోనే శని సింగనాపూర్ ఆలయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో రెండు ఆలయాల గురించి తెలుసుకుందాం. వాటిలో ఒకటి
దేశ రాజధాని దిల్లీలోని ఛతర్పుర్లోని శని ధామ్ దేవాలయం. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శని దేవుడి విగ్రహం ఉంటుంది. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇక్కడి శనీశ్వరుడిని సందర్శిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయట. ఈ ఆలయ ప్రాంగణంలో పురుషులు స్నానం చేసి దేవుడికి ఆవాల నూనె సమర్పిస్తారు. ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి శని దోషాలైనా తొలగిపోతాయని విశ్వాసం.
మరో సుప్రసిద్ధ శని దేవుని ఆలయమే కోకిల వనం. ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలోని క్రిష్ణా నగర్లో ఉన్న ఈ శని దేవాలయాన్ని కోకిలావనంగా పిలుస్తారు. ఈ ఆలయంలో ఒక పని చేస్తే ఎలాంటి శని దోషమైనా ఇట్టే పోతుందట. ఏం చేయాలంటే.. ఏడు శనివారాలు శనీశ్వరుడికి ఆవాల నూనె సమర్పించాలట. ఇలా చేస్తే శని దోషం తొలగిపోతుందని ప్రగాఢ నమ్మకం. అసలు ఈ ఆలయానికి కోకిల వనం అనే పేరు ఎందుకొచ్చిందంటారా? ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చాడట. దీంతో అప్పటి నుంచి ఈ ఆలయాన్ని కోకిల వనం అని పిలుస్తారు.