గ్రహాల సంచారం కారణంగా జాతకమే మారిపోతూ ఉంటుంది. శుభమో.. అశుభమో జరుగుతుందని అంటారు. ఇక శుక్రుడు ఇవాళ మిథున రాశిలోకి ప్రవేశించగా.. బుధుడు ఈ నెల 14న మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన ఈ రాశుల వారికి లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుందట. చాలా పవిత్రమైనదిగా భావించబడే ఈ లక్ష్మీ నారాయణ రాజయోగం ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందట. ఇది సంపద, శ్రేయస్సు, విజయానికి సూచిక అని అంటారు. ఎవరి జాతకంలోనైనా ఈ రాజయోగం పడితే మాత్రం జీవితం అద్భుతంగా మారిపోతుందట.
రాజయోగం పట్టిన ఆ మూడు రాశులేంటంటే..
వృషభ రాశి: ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం పట్టనుందట. దీంతో ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదట. పెట్టుబడి, ఆస్తి విషయాలలో లాభాలతో పాటు కెరీర్ పరంగా కూడా మంచి అవకాశాలు ఉంటాయట.
సింహ రాశి : సింహరాశి వారికి సైతం లక్ష్మీ నారాయణ రాజయోగం పట్టనుందట. ఈ సమయంలో వీరికి పట్టిందల్లా బంగారమేనట. సామాజిక ప్రతిష్ట పెరగడంతో పాటు ఆర్థికంగానూ చాలా బాగుంటుందట.
మకర రాశి : మకర రాశి వారికి కూడా లక్ష్మీ నారాయణ రాజయోగం కారణంగా వ్యాపార, ఉద్యోగాలలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో స్థిరత్వం, పురోగతి ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే లాభాలే లాభాలని జోతిష్య పండితులు చెబుతున్నారు.