
తిరుపతి వెంకటకవులు తమ దేవీ భాగవతంలో అమ్మవారిని ఇలా స్తుతించారు..
“మహిషాసురుని రూపుమాపలేదొ…
శుంభ–నిశుంభులను సంహరించలేదొ…
రక్తబీజుని నేల రాయలేదొ…
చండ–ముండాది రాక్షసులను నశింపజేయలేదొ…
అమ్మా! భూదేవి భారమును హరించలేదొ…
మా మొక్కులను గ్రహించలేదొ?”
ఈ స్తోత్రం అమ్మవారి విజయగాథను, భక్తుల ప్రార్థనను ప్రతిబింబిస్తుంది.
కాలానుగుణ శక్తి..
“కృతేచ రేణుకా శక్తిః త్రేతాయాం జానకీ తథా
ద్వాపరే ద్రౌపదీ శక్తిః కలౌ శక్తిః గృహే గృహే”
కృతయుగంలో రేణుకాదేవి
త్రేతాయుగంలో సీత
ద్వాపరయుగంలో ద్రౌపది
కలియుగంలో ఇంటింటా శక్తిరూపిణులే తల్లులు
అందుకే మహిళను సృష్టి–స్థితి–లయకారిణి, పరమపూజనీయురాలిగా భావించాలి.
సారాంశం ఏంటంటే..
సృష్టి అంతా శక్తి నుంచే ఆవిర్భవించింది. బ్రహ్మలో సృజన శక్తిగా, విష్ణువులో పాలనాశక్తిగా, రుద్రునిలో సంహార శక్తిగా వెలుగొందుతోంది. అగ్నిలో దాహకశక్తి, గాలిలో ప్రేరణాశక్తి, సూర్యునిలో ప్రకాశశక్తి, సర్వ ప్రాణులలో జీవశక్తిగా ప్రసరిస్తోంది. ఆమెను నిర్గుణోపాసనలో పరబ్రహ్మశక్తిగా, సగుణోపాసనలో జగన్మాతగా ఆరాధిస్తారు.
సర్వ స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యః త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే
అన్నిటిలోనూ, అన్ని రూపాల్లోనూ శక్తి రూపమైన అమ్మవారిని విశ్వసించి, మాతృమూర్తిగా ఆరాధిస్తే ఆమె కారుణ్యం–వాత్సల్యంతో భక్తులను రక్షిస్తుంది.
