శ్లో𝕝𝕝 మృగమీనసజ్జనానాం తృణజలసన్తోషవిహితవృత్తీనామ్।
లుబ్ధకధీవరపిశునా నిష్కారణవైరిణో జగతి॥

పై శ్లోకాన్ని భర్తృహరిమహాకవి చెప్పాడు. దాని అర్థమేంటో తెలుసుకుందాం. అడవుల్లో గడ్డి తిని జీవించే లేళ్లు జింకలు, సముద్రల్లో నదుల్లో ఇతర జలాశయాల్లో స్వేచ్ఛగా జీవించే చేపలు – ఇవి ఎవరికీ హాని తలపెట్టవు. వాటి ప్రకృతి ధర్మాన్ని అనుసరించి అవి జీవిస్తుంటాయి. కానీ వేటగాడు, జాలరి వాటికి హాని తలపెడతాడు. అలాగే ఈ సమాజంలో సజ్జనులు కూడా వారి సహజశైలిలో పరహితం కోరి నిత్యం పరోపకారం చేస్తుంటారు. అయిననూ అటువంటివారికి కీడు తలపెట్టాలని కొందరు దుర్మార్గులు ఉంటారు కదా. అని పై శ్లోకానికి అర్థం.
