మకర సంక్రాంతి సూర్యభగవానుడి కృపను అందుకునే మహా పర్వదినం. ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ధర్మబలాన్ని పెంచుతాడని శాస్త్రాలు చెబుతాయి. అందుకే తెల్లవారుజామున పవిత్ర స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం సమర్పించి దానం చేయడం ఎంతో శుభకరం. ముఖ్యంగా శని దేవుడి అనుగ్రహం పొందాలంటే మూడు దానాలు తప్పనిసరి అంటారు. నల్ల నువ్వులు దానం చేస్తే శని ప్రభావం తగ్గి జీవితం సుఖశాంతులతో నిండుతుంది. నెయ్యితో చేసిన అన్నం లేదా కిచిడి పేదలకు పంచితే ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. అలాగే నల్ల దుప్పట్లు లేదా బెల్లం దానం చేస్తే కష్టాలు తొలగి కెరీర్, వ్యాపారంలో విజయం కలుగుతుంది. సంక్రాంతి నాడు హృదయపూర్వకంగా చేసిన దానం వందరెట్లు పుణ్యఫలాన్ని ఇస్తుందని పెద్దల నమ్మకం.

